Pamphlets

వాళ్ళేమిస్తామంటున్నారు? మనకేం కావాలి?

సాధ్యం కాని ప్రతేక హోదా డిమాండ్‌తో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా సమర్థించారు. మన రాష్ట్రంలోని పార్టీలన్నీ బిజెపి దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలను, అభ్యర్థులను కొన్ని మౌలికమైన అంశాలను గురించి అడుగుదాం!