Human Rights Forum

మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)

ONGC లో విష వాయువు లీక్ – ప్రజల జీవితాలతో చెలగాటం !
చమురు సహజవాయు సంస్థలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడటం చట్టరీత్యా నేరమని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడుతుంది. గురువారం మానవ హక్కుల వేదిక సభ్యులు కేసనపల్లి జి జి ఎస్ వద్ద కు వెళ్లి షిఫ్ట్ ఇంచార్జ్ నాయక్ తో మాట్లాడి విషయ సేకరణ చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాల కొనసాగింపుగా మరోసారి ONGC లో హైడ్రోజన్ సల్ఫైడ్

ఎదురుగా సముద్రమ్మునా వేట చేసుకోలేని దుస్థితి లో వున్న మత్యాకారులు
పెద్ద గణగల్లవాని పేట గ్రామము శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం టౌనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ లో ఉన్న మత్యకారులందరి జీవనాధారం సముద్రంపై చేపల వేట చేసుకొని జీవిస్తూ ఉంటారు, అయితే సుమారు నాలుగు సంవత్సరముల నుంచి వీరి జీవనాధారమైన సముద్రంపై వేట చేయలేని పరిస్థితి వీరికి దాపరించినది కారణం ఏమంటే రెండు కిలోమీటర్లు దూరములో వున్న నాగావళి నది వీరి గ్రామానికి దగ్గరలో ఉన్న
Press Statements (English)

Do Not Dilute CRZ Further – HRF
The Human Rights Forum (HRF) takes strong exception to the atrocious assertion by AP Tourism Minister Kandula Durgesh in the State Assembly recently that tourism development on the coast was being hampered by the Coastal Regulation Zone (CRZ) and the government would be seeking relaxations in the CRZ to overcome

HRF asks AP government to desist from acquiring a large extent of land for BPCL
The Human Rights Forum (HRF) calls on the AP government to desist from going ahead with acquiring a large extent of land by the coast in Ulavapadu mandal of Kandukur division in Nellore district for the purpose of a project of the Bharat Petroleum Corporation Ltd (BPCL). Pursuing this project
Reports

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Citizens’ Report on Security and Insecurity
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
Bulletins

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
Books

కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం
రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్, సచార్ కమిషన్ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.

రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం
తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.