Human Rights Forum
మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)

విరసం నిర్వహించదలచిన సభను తెలంగాణ పోలీసు శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని HRF తీవ్రంగా ఖండిస్తోంది.
తెలంగాణ పోలీసు శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం (విరసం) నిర్వహించదలచిన సభను అడ్డుకోవడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సభ 05-07-2026(ఆదివారం) న హైదరాబాద్లోని, సుందరయ్య భవన్ ప్రాంగణం లో జరగాల్సి ఉండె. హాలులో జరుపదల్చిన ఒక శాంతియుత ప్రజాస్వామిక సమావేశాన్ని నిరోధించడం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఇది పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛలపై నేరుగా దాడి

ప్రశ్న రావణ్ మీద నమోదైన ఉపా కేసు, పోలీస్ వ్యవస్థ పాలక వ్యవస్థను మెప్పించడానికి ఏ స్థాయి వరకు దిగజారగలదో తేట తెల్లం చేస్తుంది.
ప్రశ్న రావణ్ గా తెలిసిన బచ్చలకూర జోసెఫ్ మీద జూలై నాలుగున కృష్ణ జిల్లా గన్నవరం పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లోని రెండు సెక్షన్లు- సెక్షన్ 13, 39-నమోదు చేయడం అనేది పోలీస్ వ్యవస్థ పాలక వ్యవస్థను మెప్పించడానికి ఏ స్థాయి వరకు దిగజారగలదో తేట తెల్లం చేస్తుంది. అదే ఎఫ్.ఐ.ఆర్ లో బిఎన్ఎస్ ప్రకారం పెట్టిన పలు
Press Statements (English)

HRF strongly condemns the undemocratic and arbitrary action of the Telangana Police and the Telangana Government in preventing the organisation of the Virasam meeting
HUMAN RIGHTS FORUM, strongly condemns the undemocratic and arbitrary action of the Telangana Police and the Telangana Government in preventing the meeting of the Revolutionary Writers’ Association (RWA) Virasam, which was scheduled to be held on 05-07-2026, in Sunderayya Viganana Kendram(SVK) in Hyderabad. Preventing a peaceful democratic gathering reflects an

HRF Submits to NTR District Collector that the decision to appoint the RDO of Vijayawada to inquire into the custodial death of Gade Sai Krishna be withdrawn immediately.
ToThe District Collector,NTR District, VijayawadaAndhra Pradesh – 520002 Sub: Demand to withdraw the illegal decision to appoint an Executive Magistrate to inquire into the custodial killing of Gade Sai Krishna- Reg. Sir, The Human Rights Forum (HRF) is a citizens’ forum established with the objective of working for the protection
Reports

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Citizens’ Report on Security and Insecurity
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
Bulletins

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
Books

రాజ్యాంగాన్ని ఎలా చూడాలి?
మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు. తెలిసిన కోర్టులు ఎక్కువసార్లు కులీన, సంపన్న వర్గాల ఆలోచనల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న మంచి చట్టాలను రద్దు చేయడానికి శాసనకర్తలైనా వెనకాడుతున్నారేమో గాని కోర్టులు మాత్రం అడగకుండానే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ పనిని సులభతరం చేస్తున్నారని బాలగోపాల్ ఒక వ్యాసంలో ఘాటుగా విమర్శించారు కూడా. హిందుత్వవాదుల అసలు లక్ష్యం రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వ విలువల్ని రాజ్యాంగం నుండి తొలగించడమే. ఆ పనిని వెంటనే చేయకపోయినా, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు రాజ్యాంగ సమీక్ష పేరుతో చేసి తీరతారు. అప్పటిదాకా అన్ని రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని రాజ్యాంగాన్ని కొద్దికొద్దిగా మారుస్తూ, అందులోని సమానతా విలువల్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు చర్యలనూ అడ్డుకోవడానికి మనకు రాజ్యాంగం పట్ల సరైన అవగాహన ఉండడం అవసరం. ఈ వ్యాసాలు ఆ అవగాహనను ఇస్తాయని నమ్ముతున్నాం.

ప్రజా హక్కుల న్యాయవాది గొర్రెపాటి
మాధవరావు గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని స్మరించుకుంటూ హక్కుల రంగంలోని ఆయన సహచరులు పంచుకున్న జ్ఞాపకాలు, హక్కుల కోణంలో ఆయన రాసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలను కలిపి ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఇదివరకే చెప్పినట్టు ఆయన రచనా వ్యాసంగం హక్కుల వ్యాసాలకే పరిమితం కాదు. సాహిత్య, రాజకీయ, వ్యక్తిగత ఆసక్తులతో ఆయన రాసిన మరెన్నో వ్యాసాలు పలు పత్రికలలో వచ్చాయి. అవన్నీ ఆయనకు అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కూడా. వాటిని విడిగా ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయన అకాల మరణం వల్ల ఈ కృషి అర్ధంతరంగా ఆగిపోవడం కూడా ఎంతో బాధ కలిగించే విషయం.
మాధవరావు గారు గొప్ప స్నేహశీలి. మానవహక్కుల వేదిక సభ్యులందరితోనూ ఎంతో కలివిడిగా, ప్రేమపూర్వకంగా ఉండేవారు. చమత్కార సంభాషణలతో నిత్యం నవ్వులు పూయించేవారు. ఏ క్షణంలోనైనా ఆగిపోయే గుండె అని తెలిసినా ప్రతి క్షణం అర్థవంతంగా గడపడానికే ప్రయత్నించారు. ఈ పుస్తకం ఆయనకు మేము ఇస్తున్న ప్రేమపూర్వక నివాళి. హక్కుల రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం అద్దం పడుతుందని ఆశిస్తున్నాం.















