Human Rights Forum
మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)

జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుల, కార్యకర్తల కేసులను సమీక్షించి, వారిని విడుదల చేయాలి
గత ఏడాది కాలంలో చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది, అందులో దళ సభ్యులు మరియు నాయకులు అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాట్లను స్వీకరించి, వారిని తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చు. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణల తో జైళ్లలో ఉన్నారు.

మనుబోతులపాడు కోయ ఆదివాసులపై దౌర్జన్యం చేసిన ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఈనెల 17వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఫారెస్ట్ సిబ్బంది మనుబోతులపాడు గ్రామ పంచాయతీకి చెందిన కోయ ఆదివాసి మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక ఐదుగురు సభ్యుల బృందం బాధితులను కలిసి వివరాలు సేకరించింది. మనుబోతులపాడు జిపిలో భాగంగా ఉన్న పొడియం నాగేశ్వరరావు గుంపు హామ్లెట్ లో 23 కోయ ఆదివాసి కుటుంబాలున్నాయి. ఎవరూ పెద్దగా చదువుకోలేదు,
Press Statements (English)

Do Not Dilute CRZ Protection: Reject CRZ-III to CRZ-II Reclassification – Objections submitted by HRF
Submission made by the Human Rights Forum (HRF) before the panel conducting public hearing in Visakhapatnam on 2-09-2026 for finalisation of the draft Andhra Pradesh Coastal Zone Management Plan (APCZMP) for Visakhapatnam district. Subject: Human Rights Forum (HRF) demand for rejection of proposalsseeking to reclassify the CRZ-III area from Madhurawada in Visakhapatnam Rural mandal to Nerellavalasa in Bheemunipatnam mandal as CRZ-II and for due consideration of all objections, suggestions

Alleged Maoist sympathisers languishing in Prison: HRF appeals to Telangana CM for Humane Review of cases
During the past year, a large number of persons associated with the Maoist movement, including some who were previously members of armed squads, have surrendered or otherwise come out of underground activity and sought to return to mainstream social life in the States of Chhattisgarh, Jharkhand, Odisha and Telangana. The respective governments have facilitated and accepted such surrenders and are pursuing policies of rehabilitation and reintegration. This development is significant because it demonstrates that even in dealing with a violent political conflict, the State can recognise the possibility of reconciliation and a return to peaceful social life.
Against this background, the continued incarceration of persons alleged merely to have supported or sympathised with the Maoist movement warrants particular scrutiny
Reports

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Citizens’ Report on Security and Insecurity
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
Bulletins

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
Books

వీధి బతుకులు… విస్థాపనలు
దేశమంతటా అన్ని నగరాలలోను, పట్టణాలలోను లెక్కకు మించిన మురికివాడలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబాయిలో ఉందని మనం ‘గొప్పగా’ కూడా చెప్పుకుంటాం. పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో, రైల్వే లైన్ల పక్కన, బ్రిడ్జీల పక్కన, నదుల ఒడ్డున, కొండల పక్కన, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ చిన్న పాకనో, గుడిసెనో వేసుకోవడంతో మురికివాడల ప్రజల జీవితం ప్రారంభం అవుతుంది. ఇంతమంది

రాజ్యాంగాన్ని ఎలా చూడాలి?
మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు. తెలిసిన కోర్టులు ఎక్కువసార్లు కులీన, సంపన్న వర్గాల ఆలోచనల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న మంచి చట్టాలను రద్దు చేయడానికి శాసనకర్తలైనా వెనకాడుతున్నారేమో గాని కోర్టులు మాత్రం అడగకుండానే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ పనిని సులభతరం చేస్తున్నారని బాలగోపాల్ ఒక వ్యాసంలో ఘాటుగా విమర్శించారు కూడా. హిందుత్వవాదుల అసలు లక్ష్యం రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వ విలువల్ని రాజ్యాంగం నుండి తొలగించడమే. ఆ పనిని వెంటనే చేయకపోయినా, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు రాజ్యాంగ సమీక్ష పేరుతో చేసి తీరతారు. అప్పటిదాకా అన్ని రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని రాజ్యాంగాన్ని కొద్దికొద్దిగా మారుస్తూ, అందులోని సమానతా విలువల్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు చర్యలనూ అడ్డుకోవడానికి మనకు రాజ్యాంగం పట్ల సరైన అవగాహన ఉండడం అవసరం. ఈ వ్యాసాలు ఆ అవగాహనను ఇస్తాయని నమ్ముతున్నాం.















