Human Rights Forum

మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)

కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా నివేదికను సవరించాలి.
గౌరవనీయులైన పి. రంజిత్ బాషా గారికి,జిల్లా కలెక్టర్, కర్నూలు. విషయం: కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా (Draft Environmental Impact Assessment) నివేదికను సవరించాలి. సవరించిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. సర్, మానవ హక్కుల వేదిక (HRF) దాదాపుగా గత మూడు దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హక్కుల దృక్పధంతో హక్కుల పరిరక్షణకై,

ఉపాధి కూలీలకు వేసవి మజ్జిగ కేంద్రాలు ప్రారంభించాలి
ఉపాధి పథకం ప్రారంభ రోజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతంలో ప్రభుత్వమే వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి కూలీలకు ఇచ్చే వేతనాలకు అదనముగా కలిపి వేసేవారని, ఈ పథకాన్ని కొన్ని సంవత్సరాలు పాటు అమలు చేసి గత పది సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో నిలిపివేశారని, తక్షణమే ఈ ఆర్థిక సంవత్సరం నుండి మజ్జిగ కేంద్రాలు పునః ప్రారంభించాలని సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామంలో మంగళవారం ఉపాధి కూలీలు,
Press Statements (English)

HRF submits representation to Kurnool Collector to revise draft EIA for TGV SRAACL, project located at Gondiparla village
12.05.2024. To,Sri P. Ranjit BashaThe Collector,Kurnool District. Subject: Representation for Revision of Draft Environmental Impact Assessment (EIA) for TGV SRAACL, Gondiparla Village, Kurnool District – Request for Public Hearing Post Revision Respected Sir, The Human Rights Forum (HRF) is a citizens’ forum established with the objective of working for the

HRF demands that the Chittoor police investigate the role of Shaukat Ali in the case of suspicious death of Yasmeen Bhanu
The Human Rights Forum (HRF) demands that the Chittoor police investigate the role of Sheik Shaukat Ali in the case of suspicious death of Sheik Yasmeen Bhanu and also add sections pertaining to murder and conspiracy to murder against Sheik Mohammed Lalu and one more person. Following the news about
Reports

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Citizens’ Report on Security and Insecurity
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
Bulletins

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
Books

కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం
రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్, సచార్ కమిషన్ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.

రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం
తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.