లాభాలు కార్పోరేట్లకు, కాలుష్యం ప్రజలకా?
ఆ ప్రాంతంలో అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న పారిశ్రామిక కాలుష్యం గురించి గత కొద్ది కాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలు, ఫిర్యాదుల గురించి తెలుసుకుని,నలుగురు సభ్యులతో కూడిన హెచ్.ఆర్.ఎఫ్. బృందం ఈ రెండు మండలాల్లో అనేక కాలుష్యం ప్రభావిత గ్రామాలను 15-5-2026న సందర్శించింది. ఈ బృందం అచ్యుతాపురం మండలంలోని పూడిమడక ప్రాంతాన్ని, రాంబిల్లి మండలంలోని సీతపాలెం, కంసాలి కాలనీ, లాలంకోడూరు, ఎరకన్నపాలెం గ్రామాలను సందర్శించి అక్కడ రైతులు, మత్స్యకారులను కలిసివిషయాలు తెలుసుకుంది. అక్కడ కొన్ని పదుల సంఖ్యలోనున్న ఫార్మా, రసాయనిక కర్మాగారాల నుండి అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్ధాలు పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లోకి పారడం మేము ప్రత్యక్షంగా చూసాము.

