Fact Finding Reports (Telugu)

Fact Finding Reports (Telugu)

రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడకండి

చెంగిచెర్ల సంఘటన హిందూత్వ రాజకీయాలకు ఒక ఉదాహరణ. ‘మందిర్ వహీ బనా దేంగే’ పాట హిందుత్వ పాప్ గా చలామణీలోకి తీసుకు వచ్చేసారు. అప్పుడయినా ఇప్పుడయినా హిందూత్వ విధానంలో మార్పు లేదు. ఒక వర్గాన్ని క్రూరులుగా చూపాలంటే, చరిత్రలో వారి పూర్వీకుల క్రూరత్వాన్ని మర్చిపోనివ్వకుండా చేస్తూ, జరిగిన చరిత్రకు కొంత మసాలా జోడించి ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహనను మారుస్తూ, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి, అదిగో రెచ్చిపోయారు, ఇలా క్రూరత్వం అనేది వీరి రక్తంలోనే ఉందని ఎదురు ప్రచారం చేస్తూ, ఈ క్రూరుల నుంచి నేనే నిన్ను కాపాడతాను కాబట్టి నాకే ఓటు వెయ్యండి అని అడగడమే ఆ విధానం. దశాబ్దాలుగా భారతదేశంలోని హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టిన బాబ్రీ – అయోధ్య తగాదా తమకే అనుకూలంగా పరిష్కరించబడడంతో హిందుత్వవాదులు దాన్ని ఒక ఘనవిజయంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. నేను గెలిచాను అని చాటింపు వేసుకుంటూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు.

Fact Finding Reports (Telugu)

అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఆ ప్రకటన రాగానే రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు కలిగి ఉన్న కుటుంబాలను వాళ్ల దగ్గర ఉన్న లావణి పట్టాలు వాపసు చేయమని ప్రకటన చేశారు. నిజానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. దాని కంటే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.

Fact Finding Reports (Telugu)

చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ విస్థాపితులకు న్యాయం చెయ్యాలి

రైల్వే స్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంతవాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక అయిదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్ నగర్, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో(4/2/2024 నాడు) పర్యటించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించడం జరిగింది. మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసుల తో అధికారులు సమావేశం జరిపి వాళ్ళు చేస్తున్న సూచనల గురించి ఆలోచించాలని, భరత్ నగర్ లో ఇండ్లు కొల్పో తున్న కుటుంబాలకు ఆ ప్రాంతం లోనే గృహాలు నిర్మించి ఇవ్వాలని వేదిక డిమాండ్ చేస్తుంది.

Fact Finding Reports (Telugu)

NIMZ కోసం బలవంతపు భూసేకరణను నిలిపివేయాలి

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ  ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ  భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో  మెట్ట  పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం  చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే  పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.

Fact Finding Reports (Telugu)

సమగ్రమైన కరువు సహాయక చట్టం రూపొందించాలి

డిసెంబర్ 2, 2018 న  ముగ్గురు సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం విజయనగరం జిల్లాలో నెలకున్న కరువు పరిస్థితులను, వాటిపై ప్రభుత్వ స్పందనను పరిశీలించడానికివెళ్ళింది.

Fact Finding Reports (Telugu)

మల్లికార్జున్ పై హిందూత్వ ఉన్మాదుల దాడి గర్హనీయం

మల్లమరి మల్లికార్జున్ నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. 2018 జూలై 8వ తేదీన కోటగిరి పాఠశాలలో చేరాడు. 2022

Scroll to Top