Fact Finding Reports (Telugu)

Fact Finding Reports (Telugu)

బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదికి గరిష్ట శిక్షి విధించాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ ‘పదహారు చింతల తండా’ లో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాలను సేకరించింది.

Fact Finding Reports (Telugu)

రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండినా దళితులపై వివక్ష యథాతథం

దేశానికి స్వాతంత్రం వచ్చి, మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన. రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా, ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.

Fact Finding Reports (Telugu), Latest Posts

కౌలు రైతులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత

రెండు కుటుంబాల వారు వ్యవసాయం కలిసిరాకపోవడానికి వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు పెరిగిన పెట్టుబడులు, కల్తీ మందులని చెప్పారు. వారి కళ్ళకు అవే కనపడుతున్నాయి. వ్యవసాయం నడ్డి విరుస్తున్న ప్రభుత్వ విధానాలే ఈ స్థితికి ప్రధాన కారణం కాగా వ్వాటికి తోడుగా  వాతావరణ మార్పులు కూడా చేరి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు సంఘటనలలోనూ మాకది స్పష్టంగా కనపడింది. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్యాకేజిని ప్రకటిస్తే వారు కొంతైనా అప్పుల బాధ నుండి బయటపడతారు. అలాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయంలో భరోసా ఇచ్చి అన్ని పధకాలకు అర్హత కలిపించాలి. వాతావరణ వైపరీత్యాలు జరిగినప్పుడు సమయానికి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. యే ప్రభుత్వానికైనా ఇది కనీస బాధ్యతగా ఉండాలి.

Fact Finding Reports (Telugu)

రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడకండి

చెంగిచెర్ల సంఘటన హిందూత్వ రాజకీయాలకు ఒక ఉదాహరణ. ‘మందిర్ వహీ బనా దేంగే’ పాట హిందుత్వ పాప్ గా చలామణీలోకి తీసుకు వచ్చేసారు. అప్పుడయినా ఇప్పుడయినా హిందూత్వ విధానంలో మార్పు లేదు. ఒక వర్గాన్ని క్రూరులుగా చూపాలంటే, చరిత్రలో వారి పూర్వీకుల క్రూరత్వాన్ని మర్చిపోనివ్వకుండా చేస్తూ, జరిగిన చరిత్రకు కొంత మసాలా జోడించి ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహనను మారుస్తూ, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి, అదిగో రెచ్చిపోయారు, ఇలా క్రూరత్వం అనేది వీరి రక్తంలోనే ఉందని ఎదురు ప్రచారం చేస్తూ, ఈ క్రూరుల నుంచి నేనే నిన్ను కాపాడతాను కాబట్టి నాకే ఓటు వెయ్యండి అని అడగడమే ఆ విధానం. దశాబ్దాలుగా భారతదేశంలోని హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టిన బాబ్రీ – అయోధ్య తగాదా తమకే అనుకూలంగా పరిష్కరించబడడంతో హిందుత్వవాదులు దాన్ని ఒక ఘనవిజయంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. నేను గెలిచాను అని చాటింపు వేసుకుంటూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు.

Fact Finding Reports (Telugu)

అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఆ ప్రకటన రాగానే రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు కలిగి ఉన్న కుటుంబాలను వాళ్ల దగ్గర ఉన్న లావణి పట్టాలు వాపసు చేయమని ప్రకటన చేశారు. నిజానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. దాని కంటే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.

Fact Finding Reports (Telugu)

చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ విస్థాపితులకు న్యాయం చెయ్యాలి

రైల్వే స్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంతవాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక అయిదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్ నగర్, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో(4/2/2024 నాడు) పర్యటించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించడం జరిగింది. మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసుల తో అధికారులు సమావేశం జరిపి వాళ్ళు చేస్తున్న సూచనల గురించి ఆలోచించాలని, భరత్ నగర్ లో ఇండ్లు కొల్పో తున్న కుటుంబాలకు ఆ ప్రాంతం లోనే గృహాలు నిర్మించి ఇవ్వాలని వేదిక డిమాండ్ చేస్తుంది.

Fact Finding Reports (Telugu)

పులుల మరణానికి బాధ్యులను చేస్తూ ఆదివాసీ యువకులపై కేసులు మోపటం అన్యాయం

ఈ జనవరి 6 మరియు 8వ తేదీల్లో మరణించిన రెండు పెద్ద పులుల విషయంలో వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా

Fact Finding Reports (Telugu)

NIMZ కోసం బలవంతపు భూసేకరణను నిలిపివేయాలి

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ  ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ  భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో  మెట్ట  పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం  చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే  పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.

Fact Finding Reports (Telugu)

జాబ్ కార్డుల తొలగింపు గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికే విరుద్ధం

మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పధకంలో 2022-23 లో పెద్దఎత్తున జరిగిన జాబ్ కార్డులు, పేర్ల తొలగింపును మానవ హక్కుల వేదిక (HRF) చాలా తీవ్రంగా

Fact Finding Reports (Telugu)

అధికార బలంతో చేపట్టిన అక్రమ ఆక్వా చెరువుల తవ్వకం ఆపాలి

ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల

Scroll to Top