Latest Posts

Latest Posts, Reports (Telugu)

భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.

Books (Telugu), Latest Posts

కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?

బాలగోపాల్‌ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Latest Posts, Reports (Telugu)

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.

Scroll to Top