న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28, 2026 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న పట్ల హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
NEET-UG 2026 పరీక్షా విధానంలో జరిగిన అక్రమాలపై విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, గత 17 రోజులుగా శ్రీ వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యాల వల్ల తమ భవిష్యత్తును కోల్పోతున్న విద్యార్థులకు న్యాయం జరగాలని, అలాగే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్న నిరసనకారులకు HRF సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విశ్వసనీయత పదేపదే దెబ్బతినడం, మన విద్యాపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఇది దేశంలోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శాంతియుత నిరసనకారుల ఆరోగ్యం క్లిష్ట పరిస్థితికి చేరుకునే వరకు వేచి చూడకుండా, వారితో వెంటనే చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిరసనకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని, బాధితులైన కుటుంబాలకు న్యాయం చేయాలని మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.
నిరసన తెలపడం మరియు అసమ్మతిని వ్యక్తం చేయడం మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, అలాగే తప్పు జరిగినప్పుడు సర్దుకోవడం ప్రభుత్వం బాధ్యత.
S. జీవన్ కుమార్,
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
తిరుపతయ్య,
మానవ హక్కుల వేదిక – తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
M. సురేష్ బాబు,
మానవ హక్కుల వేదిక – హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు
15-07-2026,
హైదరాబాద్.