Author name: Human Rights Forum

Our Writers

ప్రజా చైతన్యం పై ‘ఉపా’ దాడి (ఆంధ్రజ్యోతి, 25.06.2024)

అరుంధతి రాయ్, షేక్ షాకత్ హుస్సేన్ (కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్) పైన పద్నాలుగేళ్ళ క్రితంనాటి ఆరోపణలను సాకుగా చూపిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా […]

Our Writers

అన్నిటికీ రేషన్ కార్డు అడిగితే ఎలా? – వి. బాలరాజ్‌ (ఆంధ్రజ్యోతి, 20.06.2024)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అసలు రేషన్‌ కార్డుల జారీ జరగనే లేదు. గతంలో ఇవ్వబడిన కార్డుకు ఒక చిన్న పేపర్‌ అంటించి ఒక ఆన్‌లైన్ టాగ్‌

Press Statements (Telugu)

వెంకటాయపాలెం శిరోముండనం తీర్పు నేరానికి తగిన శిక్షేనా?

“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో

Press Statements (Telugu)

అరుంధతి రాయ్ పై ఉపా కేసు, ఫాసిస్ట్ పాలనా విధానానికి పరాకాష్ట!

అరుంధతి రాయ్ మరియు షేక్ షౌకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) ల మీద 14 ఏళ్ళ క్రితం నాటి

Pamphlets

శిరోముండనం తీర్పు….. నేరానికి తగిన శిక్షేనా?

ఒకవైపు బలవంతులైన ముద్దాయిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నానాటికీ మరింత శక్తివంతులు అవుతున్నారు. మొదట నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఉంటాడు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రధాన ముద్దాయికి ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కాబట్టి కేసు విచారణలో పురోగతిని అడ్డుకుంటున్నారు. మరోపక్క బాధితులు మాత్రం ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా పొందలేని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. అంతెందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టప్రకారం రావలసిన నష్టపరిహారం ఈనాటికీ వారికి అందనే లేదు. శిరోముండనంతో వారు తలవంపుల పాలయ్యింది ఒక ఎత్తయితే; ప్రభుత్వాలు, న్యాయస్థానాల వివక్షపూరితమైన తీరుతెన్నులతో జరిగిన అవమానం మరో ఎత్తు. అయినప్పటికీ చట్టాలంటే నమ్మకం సడలకుండా, న్యాయస్థానాల వైఖరి ఎడల విముఖత లేకుండా పట్టుదలతో నిలబడ్డారు. ఈ క్రమంలో ఆది నుంచి నేటికీ ఎన్నో పరీక్షలు, సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాధితులు ఎస్సీలు కాదనే కొత్త వాదనని ముద్దాయిలు లేవనెత్తితే, తమను తాము దళితులుగా నిరూపించుకున్నారు.

Fact Finding Reports (Telugu)

రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండినా దళితులపై వివక్ష యథాతథం

దేశానికి స్వాతంత్రం వచ్చి, మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన. రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా, ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.

Pamphlets

శిరోముండనం కేసులో నేరస్తుడే అభ్యర్థా?

శిక్షాకాలం కనీసం రెండు సంవత్సరాలు అయితే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అర్హత కోల్పోతారు. కానీ ఈ కేసులో గరిష్ట శిక్ష కాలం 18 నెలలు మాత్రమే కావడంతో చట్టపరంగా అతని అభ్యర్థిత్వానికి ఎటువంటి అడ్డంకి లేదు కానీ మన రాజకీయాలలో నైతికత, సిగ్గులేనితనం ఎంతవరకు దిగజారిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆవేశంలో జరిగిన సాధారణ నేరం లాంటిది కాదు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల అధిపత్యం, అణిచివేత వికృత రూపంలో బయటపడ్డ ఒక సందర్భం. నేర తీవ్రతకు సరిపడగా శిక్షాకాలం లేదని బాధితులు, వారికి బాసటగా నిలబడ్డ సంఘాలు వాపోతుండగా మళ్లీ నేరస్తున్నే అభ్యర్థిగా నిలబెట్టడం రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే. రాజకీయాల్లో నైతిక విలువలకు చోటు లేదని అందరికీ తెలుసు. అయితే ఈ దిగజారుడుతనాన్ని ఎక్కడో ఒకచోట అడ్డుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థలే విచ్ఛిన్నమైపోతాయి. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే!

Scroll to Top